క్రైమ్/లీగల్

కొడుకును నరికి చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, జూన్ 29: ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తూర్పుగడ్డతండాలో చోటుచేసుకుంది. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగడ్డతండాకు చెందిన కెతావత్ రాములు నాయక్ తాగుడుకు బానిసై ఉన్న ఒక ఎకరా వ్యవసాయ పొలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా అందుకు భార్య కెతావత్ కమలమ్మ, పెద్ద కుమారుడు కెతావత్ ఆంజనేయులునాయక్ అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న కెతావత్ రాములునాయక్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న కెతావత్ ఆంజనేయులు నాయక్ (21)ను గొడ్డలితో నరికి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి రాములు నాయక్ ఇంట్లో నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మృతుడి తల్లి కెతావత్ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

రేషన్ బియ్యం పట్టివేత
కొందుర్గు, జూన్ 29: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శనివారం కొందుర్గు మండల పరిధిలోని చిన్నఎల్కిచర్ల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం చిన్నఎల్కిచర్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వివరించారు. అక్రమ రేషన్ బియ్యం తరలింపు విషయాన్ని గ్రామానికి చెందిన అల్లి గోపాల్‌ను ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.