క్రైమ్/లీగల్

రెండేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసి నిప్పంటించుకున్న వివాహిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల్పూర్, జూలై 2: వేల్పూర్ మండలం పడిగెలలో మంగళవారం రెండేళ్ల చిన్నారిని సజీవ దహనం చేసి.. తాను నిప్పంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటనలో చిన్నారి కూతురు లిల్లీ మరణించగా తల్లి వౌనిక పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వౌనిక తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మినాలుగేళ్ల క్రితం నిజాంసాగర్ మండలం నుంచి బతుకుతెరువు నిమిత్తం పడిగెల గ్రామానికి వచ్చారు. మూడేళ్ల క్రితం కూతురు వౌనికకు నిజాంసాగర్ మండలం ఆరేరు గ్రామంలో ఉండే మేనబావ రాజుకు ఇచ్చి వివాహం చేశారు. సంవత్సరంన్నర క్రితం వౌనిక పాపకు జన్మనిచ్చింది. అత్తగారి ఇంటి వద్ద ఉన్న వౌనిక తన కూతురు లిల్లీతో పాటు పది రోజుల క్రితం పడిగెల గ్రామంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. రోజు మాదిరిగానే మంగళవారం ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వౌనిక తన 18 నెలల కూతురు లిల్లీ ఒంటిపై కిరోసిన్ పోసి, ఆ తర్వాత తాను కూడా ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పారు. 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆర్మూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లీ, కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూతురు లిల్లీ మృతి చెందగా తల్లి వౌనిక పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

చిత్రం... మృతి చెందిన చిన్నారి లిల్లీ