క్రైమ్/లీగల్
టోలీచౌకీలో కుప్పకూలిన క్రేన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెహిదీపట్నం, జూలై 2: టోలీచౌకీ ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండగా డ్రైవర్పై క్రేన్ పడి సంఘటన స్థలంలోనే మృతిచెందిన ఘటన గోల్కొండ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గత కొంత కాలంగా టోలిచౌకీలో ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. పంజాబ్కు చెందిన గుర్ప్రీత్సింగ్ (45) ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న క్రేన్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం వేకువ ఝామున 4 గంటల ప్రాంతంలో ప్లై ఓవర్ పిల్లర్పై దూలం క్రేన్ సహాయంతో పైకి ఎక్కిస్తుండగా ప్రమాదవ శాత్తు క్రేన్ కిందపడింది. సంఘటనలో క్రేన్ డ్రైవర్గా పనిచేస్తున్న గుర్ప్రీత్ సింగ్పై క్రేన్ పడింది. డ్రైవర్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ను అక్కడి నుంచి తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంబంధిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.