క్రైమ్/లీగల్

తోటపల్లి ఎడమ కాలువలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, జూలై 2: కాశీ తీర్థయాత్ర ముగించుకుని తిరుగుప్రయాణంలో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు మంగళవారం వేకువజామున విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ సమీపంలోని ఎడమ కాలువలో బోల్తాపడింది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. ఘటన కు సంబంధించి స్థానిక ఎస్‌ఐ సింహాచలం అందించిన వివరాల ప్రకారం కాశీయాత్రను ముగించుకుని జియ్యమ్మవలస మండలం చినమేరంగి, కన్నపుదొరవలస, విశాఖ జిల్లా గాజువాక, తదితర ప్రాంతాలకు చెందిన 28 మంది భక్తులతో ట్రావెల్ బస్సు వస్తోంది. ఈ బస్సులో గత నెల 20న తీర్థయాత్ర వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తోటపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఎడమ కాలువలో బస్సు బోల్తాపడింది. ఈ సంఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గరుగుబిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.