క్రైమ్/లీగల్
ఖైదీ మృతి ఘటనపై 8న న్యాయ విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 July 2019
హైదరాబాద్, జూలై 3: ఉస్మానియా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మే 21 చికిత్స పొందుతూ 42 సంవత్సరాల వయసున్న విచారణ ఖైదీ అగుళ్ల లక్ష్మణ్ (తండ్రి భిక్షపతి) మృతి చెందాడు. మరణించిన సంఘటనపై ఈనెల 8వ తేదీన ఉదయం 11.00 గంటల నుంచి 5.00 గంటల వరకు న్యాయ విచారణ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కే.సూర్యలత బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సంఘటన వివరాలు తెలిసిన వారు, రక్తసంబంధీకులు, బంధువులు, మరి ఇతరులేవరైనా ఈనెల 8న ఉదయం 11.00 గంటల నుంచి 5.00 గంటలలోపు నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి కార్యాలయానికి వచ్చి విచారణ అధికారి ముందు వాంగ్మూలాన్ని ఇవ్వాలని సూర్యలత కోరారు.