క్రైమ్/లీగల్

అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జూలై 6: అప్పుల బాధతో ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె మృతి చెందగా, భార్య అపస్మారక స్థితిలో వైద్య చికిత్స పొందుతోంది. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (సింహాచలం) సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు తన భార్య చంద్రకళ, కుమార్తె చాందినితో కలిసి స్వామి దర్శనానికి శనివారం ఇక్కడకు వచ్చారు. వీరు సింహాచలం దేవస్థానం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూల్ డ్రింక్‌లో పురుగు మందు కలిపి తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు 108 సహాయంతో కేజీహెచ్‌కు తరలించారు. అయితే తండ్రి ఈశ్వరరావు (42), కుమార్తె చాందిని (13) మృతి చెందగా, భార్య చంద్రకళ (38) కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.