క్రైమ్/లీగల్

హత్య చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 8: ఇటీవల నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో తుపాకీ గాయాలతో మృతి చెందిన ఫైజల్ కేసు కీలకమలుపు తిరిగింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని అతని భార్య ఆరోపించారు. తన భర్తను ఎవరో హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 4న మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపై బెంజ్‌కారులో తుపాకీ గాయాలకు గురై ఫైజల్ మృతిచెందాడు. ఘటనలో ఫైజల్ తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఫైజల్ భార్య.. తన భర్త మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని, దర్యాప్తును లోతుగా చేయాలని పోలీసు అధికారులను కోరారు. కేసును ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గన్‌ను మధ్యప్రదేశ్‌లోని మాడ్వా ప్రాంతంలో ఫైజల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.