క్రైమ్/లీగల్

మతిస్థిమితం సరిగ్గా లేని కూతురిని కొట్టి చంపిన తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకొత్తపల్లి, జూలై 8: మతిస్థిమితం సరిగా లేని కూతురును తండ్రి రోకలితో కొట్టి చంపిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకొల్ గ్రామానికి చెందిన కడ్తాల ఎర్రన్న తన కూతురు శ్యామల (32)ను రోకలిబండతో కొట్టి చంపాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. ఎర్రన్న కూతురు శ్యామలకు పదేళ్ల క్రితం కోడేరు మండల కేంద్రానికి చెందిన శంకర్‌తో వివాహం అయ్యింది. ఆమెకు ఏడాది కూతురు ఉంది. శ్యామలకు కొంతకాలంగా మతిస్థిమితం లేకపోవడంతో శంకర్ శ్యామలకు విడాకులు ఇచ్చాడు. శ్యామలను హైదరాబాద్‌లోని జిల్లెలగూడ చర్చి వద్ద ఉంచారు. నెలరోజుల క్రితం కల్వకోల్ గ్రామానికి వచ్చి తిరుగుతుండగా సోమవారం ఉదయం తండ్రి శ్యామలను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇందుకు నిరాకరించడంతో రోకలిబండతో తలపై తండ్రి ఎర్రన్న కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు కొల్లాపూర్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై నరేష్ సంఘటనా స్థలానికి వెళ్లి హత్యకు దారి తీసిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తమ్ముడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కొల్లాపూర్ కోర్టులో హాజరుపర్చినట్టు హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు.

చిత్రం... తండ్రి చేతిలో హత్యకు గురైన శ్యామల