క్రైమ్/లీగల్

తాగుడుకు బానిసై వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూలై 16: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పద్మశాలిపురం ప్రాంతానికి చెందిన శంకరయ్య(50), పుష్పలత దంపతులు. వీరికి ముగ్గురు అమ్మాయిలు సంతానం. శంకరయ్య మద్యానికి బానిసై ఇంట్లోని సభ్యులతో తరుచూ గొడవ పడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం తల్లికి చెందిన పట్ట గొలుసులు ఇంట్లో నుంచి తీసుకెళ్లి అమ్ముకొని మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ విషయంపై భార్య భర్తతో గొడవ పడింది. అనంతరం పుష్పలత ఆమె తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శంకరయ్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పుష్పలత ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.