క్రైమ్/లీగల్

ఏటీఎం నుంచి రూ.25వేలు తస్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులకచర్ల, జూలై 16: మండలంలోని గణాపురం గ్రామానికి చెందిన సునీల్‌కు మంగళవారం ఉదయం పేటీఎం నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించిన సైబర్ నేరగాళ్లు వివిధ పద్ధతుల్లో బాధితుని ఏటీఎం కార్డు సంఖ్య సంపాదించి అతని ఖాతా ద్వారా రూ.25 వేలు తస్కరించారు. విషయం తెలియని సునీల్ నిజంగానే బ్యాంకువాళ్లే ఫోన్‌చేసి ఉండవచ్చునని వివరాలన్నీ తెలిపాడు. దీంతో వెంటనే ఖాతా నుంచి రూ. 25 వేలు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది. ఆరాతీస్తే గుర్తు తెలియని అగంతకుడు ఫోన్‌చేసి తన ఖాతాలోని డబ్బులను దోచుకున్నట్లు తెలుసుకుని కులకచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఏమి చేయలేమని ప్రయత్నిస్తామని చెప్పి కేసు నమోదు చేసుకున్నారు.