క్రైమ్/లీగల్
ఫొటో తీశాడని పోలీస్పై దాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేరేడ్మెట్, జూలై 18: విధి నిర్వహణలో ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వౌలాలి సాధుల్లానగర్లో నివసించే మహ్మద్ ముజీబ్(30), సాజీద్ హుస్సేన్(21), జియాగూడలో నివసించే గౌస్(27) గురువారం మల్కాజిగిరి పరిధిలో వౌలాలి చౌరస్తాలోని వౌలాలి కమాన్ వద్ద బైక్పై ముగ్గురు వెళ్తుండగా అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ మహ్మద్ ముజఫర్ అడ్డుకొని ఫొటో తీశాడు. బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు వచ్చి తమనే ఫొటో తీస్తావా అంటూ కానిస్టేబుల్తో గొడవ పెట్టుకుని దాడి చేసి కెమెరా లాక్కున్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకురాలైన తమ బంధువు మహ్మద్ బేగం(42), గఫర్ హుస్సేన్(60)కి సమాచారం ఇవ్వడంతో వారువచ్చి కానిస్టేబుల్తో గొడవకు దిగారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసు విధులకు అటంకం కలిగించినందుకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.