క్రైమ్/లీగల్

విహారయాత్రలో విషాధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: విహార యాత్ర కోసం వెళ్లిన నాగోల్ మోహన్‌నగర్‌లో నివసించే వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కులూమనాలిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. పారాచ్యూట్ ద్వారా గాలిలోకి ఎగిరిన ఆయన ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని కొత్తపల్లె గ్రామం. కుటుంబంతో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌లోని నాగోల్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి శ్రీకర ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. చంద్రశేఖర్ పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం కన్సల్టెంట్ వైద్యుడిగా పనిచేస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. చంద్రశేఖర్ మృతిపై తోటి వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులూమనాలి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో ప్యారాచూట్ వైర్లు తెగిపోవడంతో చంద్రశేఖర్ రెడ్డి కిందపడి మృతి చెందారు.