క్రైమ్/లీగల్

అనుమానంతో గొంతుకోసి భార్య దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటరూరల్, ఆగస్టు 11: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాటోత్‌తండాకు చెందిన ధరావత్ శంకర్, మల్లమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్కెట్‌లో హమాలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శంకర్ గత కొద్ది రోజులుగా మల్లమ్మ ప్రవర్తనపై అనుమానంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా గొంతును కోసిన కత్తిని నీళ్లతో కడిగి దాచాడు. ఆదివారం ఉదయం స్థానికులకు అనుమానం వచ్చి మృతిచెందిన మల్లమ్మను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. లిపారు.