క్రైమ్/లీగల్

అరబిందోలో పేలిన బాయిలర్.. ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణస్థలం, ఆగస్టు 11: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం పారిశ్రామిక వాడలో ఉన్న అరబిందో రసాయన పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా మక్కువ మండలం కంబర గ్రామానికి చెందిన బి.రాహుల్(28), శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన బాయిలర్ ఆపరేటర్ బి.రాజారావు(35) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. రణస్థలం మండలం నెలివాడ గ్రామానికి చెందిన వై.సన్యాసిరావు తీవ్రంగా గాయపడ్డాడు. వీరంతా పరిశ్రమలో త్రివేణి కాంట్రాక్ట్ వద్ద పనిచేస్తున్నారు. గాయాలపాలైన సన్యాసిరావును చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. పరిశ్రమలో భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జేఆర్ పురం సిఐ మల్లేశ్వరరావు, తహశీల్దార్ సత్యనారాయణ, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.