క్రైమ్/లీగల్

భార్య గొంతు కోసి.. దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన గొల్కొండ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ గొల్కొండలో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలోని మోతిమహల్‌లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. గోల్కొండ మోతీమహల్‌కు చెందిన బషీర్ అహ్మద్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బషీర్‌కు ఇదివరకే పెళ్లైంది. భార్య చెల్లెలు సమీరా బేగం (35)తో రెండో వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం. సమీరా బేగంపై గత కొంతకాలం నుంచి బషీర్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలు పోలీస్టేషన్ వరకూ చేరడంతో అక్కడ పోలీసులు భార్య, భర్తకు కౌనె్సలింగ్ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11.30 పోలీసులకు బషీర్ ఫోన్ చేసి తన భార్యను హత్య చేసినట్లు తెలిపి పరారయ్యాడు. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు సతీష్ రెడ్డి, శ్రీనివాసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుకోసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో ఎలాంటి ఆయుధం దొరకలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బషీర్ అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.