క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో పొన్నాల మనుమడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / గచ్చిబౌలి, అగస్టు 12: గచ్చిబౌలిలో పల్సర్ బైక్ అదుపుతప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మనువడు కోడూరి దృపద్ (22) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దృపద్ గౌలిదొడ్డిలో స్నేహితుడు కృష్ణ చైతన్యను సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వదిలి వస్తుండగా విప్రో సర్కిల్లో సమీపంలో ఘటన చోటు చేసుకుంది. టీచర్స్ కాలనీ హన్మకొండకు చెందిన కరుణాకర్, మాధవిల చిన్న కొడుకు దృపద్ ఖాజాగూడా వెంకటేశ్వర పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. మాదాపూర్‌లోని ఐకాన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనువడు దృపద్. ప్రమాదాన్ని గచ్చిబౌలి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దృపద్ డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది బైక్. దీంతో తీవ్రగాయాలైన దృపద్ మృతి చెందాడు. మృతదేహన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
చిత్రాలు.. ప్రమాదంలో మృతి చెందిన దృపద్..
*అదుపు తప్పి రోడ్డుపై పడిన బైక్