క్రైమ్/లీగల్

డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శామీర్‌పేట : హైదరబాద్ శివారులోని శామీర్‌పేటలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లిదండ్రులు, కుమారుడు ఉన్నారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ వస్తున్న ఎకో స్పోర్ట్స్ కారు అతివేగంగా వచ్చి శామీర్‌పేట కట్టపైన అదుపు తప్పింది. కారు డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న మారుతి కారుపై పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్స్‌పెక్టర్ నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. శామీర్‌పేట పరిధిలోకి రాగానే స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారు వేగంగా రావడంతో పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న కోసురు కిషోర్, అతని భార్య భారతితో పాటు కుమారుడు సుధాన్ష్‌గా గుర్తించారు. తానీష్‌కు తీవ్ర గాయాలై జూబ్లీ హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
చిత్రం...ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు