క్రైమ్/లీగల్
వ్యక్తి ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 August 2019
జీడిమెట్ల, ఆగస్టు 12: మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలేశ్వరంకు చెందిన రాయుడు నాగేశ్వర రావు (48) కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీ, మైత్రినగర్లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన నాగేశ్వరరావు మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులతో గొడవ పడి బయటికి వచ్చాడు. దీంతో దూలపల్లి ఫారెస్ట్ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.