క్రైమ్/లీగల్

బ్యాంక్ రుణం తీర్చలేక రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఆగస్టు 12: పంట రుణాన్ని బ్యాంక్‌కు చెల్లించలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పామర్రు మండలం పెదమద్దాలి గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగేశ్వరరావు అనే రైతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి, మంత్రి కొడాలి నాని, వైకాపా నేత పాలడుగు రాంప్రసాద్‌ల పేర్లు ఓ కాగితంపై రాసి సోమవారం పురుగుమందు తాగి మృతి చెందాడు. పెదమద్దాలి గ్రామానికి సమీపంలో చెన్నువానిపురం వద్ద చెరువు గట్టు పక్కన మృతదేహంతో పాటు ఈ లేఖ లభ్యమైంది. పెదమద్దాలి గ్రామంలో బంధువులు, స్నేహితుల పంట పొలాలను గత పదేళ్లుగా యార్లగడ్డ నాగేశ్వరరావు సాగు చేస్తున్నాడు. గత ఏడాది నుంచి వ్యవసాయంలో నష్టం వచ్చిందని, బ్యాంక్‌కు చెల్లించాల్సిన కిస్తీలు కట్టలేని స్థితిలో లేఖ రాసి సోమవారం తెల్లవారుజామున పురుగుమందు తాగి ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. ఈమేరకు పామర్రు ఎస్‌ఐ ఎ గణేష్‌కుమార్ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.