క్రైమ్/లీగల్

కాపురం చేయడం లేదని భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడివేముల, సెప్టెంబర్ 19: కాపురం చేయడం లేదని భర్త మర్మాంగాన్ని కోసింది ఓ భార్య. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల సహాకారంతో భర్త యాసుఫ్‌ను తాళ్లతో కట్టివేసి కళ్లలో కారం మర్మాంగాన్ని కత్తితో కోసింది భార్య హసీనా. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాణ్యం మండలం కొట్టాల గ్రామానికి చెందిన యూసుఫ్‌కు గడివేముల మండలం సోమాపురం గ్రామానికి చెందిన హసీనాతో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరి కాపురం సజావుగా సాగకపోవడంతో పలుసార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేశారు. తాజాగా నాలుగు రోజుల క్రితం హసీనా పుట్టింటికి చేరుకుని భర్త యూసుఫ్ తనతో కాపురం చేయడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ చిరంజీవి బుధవారం భార్యాభర్తలకు కౌనె్సలింగ్ ఇచ్చి పంపించారు. గురువారం ఉదయం హసీనా తన తల్లిదండ్రులు గుజార్‌మియ్యా, ఖైరున్‌బీ, తమ్ముడు వాహబ్ సాయంతో యూసుఫ్‌పై దాడికి పాల్పడింది. అనంతరం యూసుఫ్‌ను తాళ్లతో కట్టివేసి కళ్లలో కారంచల్లి మర్మాంగాన్ని కత్తితో కోసింది. తీవ్రంగా గాయపడిన యూసుఫ్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. యూసుఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.