క్రైమ్/లీగల్

వాగులో కొట్టుకుపోయిన కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 19: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరువాగులో ఆటో కొట్టుకుపోయిన సంఘటనలో గల్లంతైన ఆరుగురు కుటుంబసభ్యుల్లో మూడు మృతదేహాలు గురువారం లభించాయి. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈనెల 16 వతేదీ అర్ధరాత్రి యర్రగుంట్ల మండలం పోట్లదుర్తికి చెందిన రామాంజనేయులు తన భార్య పెంచలమ్మ, తల్లి సుబ్బమ్మ, పిల్లలు బాబు, మేఘన, అంజలితో కలిసి ఆటోలో కామనూరువాగు దాటుతుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. మృతదేహాల కోసం గాలించిన పోలీసులకు గురువారం కామనూరు సమీపంలో కుందూనది ఒడ్డున సుబ్బమ్మ(52), అంజలి(4), మేఘన(5) మృతదేహాలు బయటపడ్డాయి. మిగతా ముగ్గురి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. కుందూనదిలో వరద కారణంగా మృతదేహాల ఆచూకీ లభించడం లేదని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలు బయటపడడంతో ఆ కుటుంబసభ్యులు విషాదంలో మునిగారు.