క్రైమ్/లీగల్

లోయలో పడిన కారు:నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, అక్టోబర్ 6: ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి లోయలో పడిన సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దకోంగ్-టుండా రోడ్డుపై వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం బార్మోర్‌లోని తరెల్లా గ్రామం వద్ద సుమారు 600 మీటర్ల లోయలో పడిపోయింది.
ఈ సంఘటనలో రాజేంద్ర కుమార్ (30), రమేష్ కుమార్ (34), సంజీవ్ కుమార్ (30), సురేంద్ర కుమార్ (34) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ బిట్టూను సమీప ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణం.