క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 24: పెళ్లి బృందం ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా ఓబులదేవరచెరువు మండలం గాజుకుంటపల్లి వద్ద మంగళవారం రాత్రి 9.30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో లక్ష్మమ్మ(45), నాగేశ్వరి(13), కార్తీక్(13), మంజునాధ్(12) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం బాగేపల్లి తాలూకా కమరాపల్లికి చెందిన గౌతమి వివాహం అనంతపురం జిల్లా ఓడి చెరువు మండలం దిగువపల్లికి చెందిన ఆంజనేయులుతో బుధవారం జరగాల్సి ఉంది. పెళ్లికూతురు బంధువులంతా ట్రాక్టర్‌ను తొలుత పెళ్లికొడుకు ఊరైన దిగువపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి అంతా కలిసి ట్రాక్టర్‌లో గాజుకుంటపల్లి ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరారు. గాజుకుంటపల్లి వద్ద ట్రాక్టర్ రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో పెళ్లికూతురు తల్లి లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో పెళ్లికూతురు గౌతమి, పెళ్లికొడుకు ఆంజనేయులు, అతడి తండ్రి గాయపడ్డారు.