క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇరువురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంగుటూరు, ఏప్రిల్ 28: మోటారు సైకిల్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులకు గాయాలైన సంఘటన శనివారం ఉంగుటూరు మండలం బాదంపూడి రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. చేబ్రోలు ఎస్సై వెంకట నాగరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం బాదంపూడి బైపాస్ రోడ్డులో శనివారం చిన్నకారు మోటారు సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో పసలపూడి శివసత్యనారాయణ (42) మృతిచెందాడు. ఈ ప్రమాదంలో రాధికకు తీవ్ర గాయాలు కాగా, ఆమె ఆరేళ్ళ కుమార్తెను, సంవత్సరం కుమారునికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాధిక మృతిచెందింది. రాధిక తన కుమార్తెతో తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామం వచ్చింది. ఆమెతో పాటు కుమార్తెను పసలపూడి శివసత్యనారాయణ తన మోటారు సైకిల్‌పై భీమడోలు తీసుకెళ్తుండగా బాదంపూడి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. శివసత్యనారాయణ మృతదేహానికి తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.