క్రైమ్/లీగల్
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 29 April 2018
రామగిరి, ఏప్రిల్ 29 : మండలంలోని శేషంపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. శేషంపల్లి గ్రామానికి చెందిన మజ్జిగ వర్మతేజ (15) గ్రామ సమీపంలో గల చెరువుకు తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన వర్మతేజ లోతైన ప్రదేశంలోకి వెళ్ళి ఈద లేక మునిగిపోయాడు. వెంటనే స్నేహితులు గాలించినా దొరకకపోవడంతో గ్రామంలోకి వెళ్ళి పెద్దలను పిలుచుకువచ్చి వెతికించగా అప్పటికే వర్మతేజ శవమయ్యాడు. విషయం తెలియగానే రామగిరి ఎస్ఐ విజయ్కుమార్ సంఘటన స్థలానికి వెళ్ళి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.