క్రైమ్/లీగల్

12 మందిపై హత్యకేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, మే 1 : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామానికి చెందిన నాగరాజు(20) అనే యువకుడిని బలవంతంగా తీసుకుపోయి నోటిలో పురుగుల మందు పోసి హత్య చేసిన సంఘటనలో ఆదే గ్రామానికి చెందిన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివాంజల్ మంగళవారం విలేఖర్లకు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగరాజు గత కొన్ని రోజుల క్రితం జగ్గాపురం గ్రామానికి వివాహానికి వెళ్ళాడన్నారు. వివాహంలో రెండు తులాల బంగారం, దొంగలించినట్లు, దీనిపై నాగరాజుపై కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. అయితే బంగారం ఇవ్వాలని దొడ్డిమేకల గ్రామానికి చెందిన భాస్కర్, హనుమంతు, ఉరుకుందు, మల్లికార్జున, రామాంజినేయులు, అయ్యప్పలతోపాటు మరో ఆరు మందికి నాగరాజును బెదిరించడంతో పాటు ఇంట్లోకి తీసుకుపోయి బలవంతగా నోటిలో పురుగులు మందు పోసినట్లు ఆయన వెల్లడించారు. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజును చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి రామాంజినేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు.