క్రైమ్/లీగల్

వరికోత మిషన్ కింద పడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, మే 1: మండల పరిధిలోని తిప్డంపల్లి శివారులో మంగళవారం సాయంత్రం వరికోత మిషన్ కింద పడి ఇద్దరు మృతిచెందారు. ఆత్మకూరు ఏఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తిప్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెరాములు వరిపొలంలో కోత మిషన్ ద్వారా వరిపైరు కోస్తోంది. ఈ సమయంలో మండల పరిధిలోని కత్తెపల్లి గ్రామానికి చెందిన రాములు, కొత్తకోట మండలంలోని అప్పరాల గ్రామానికి చెందిన బాలస్వామిలు ద్విచక్రవాహనంపై కత్తెపల్లికి వెళ్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వరికోత మిషన్ పొలం నుండి రివర్స్ గేరులో దూసుకురావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. బాలస్వామి (57), రాములు (35)లు ఆత్మకూరులో పనిముగించుకొని వస్తుండగా వరికోత మిషన్ డ్రైవర్ పాటలు పెట్టుకొని నడుపుతుండటంతో వెనుక వెళ్తున్నవారిని గమనించకుండా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.