క్రైమ్/లీగల్

క్రషర్ మిల్లులో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మే 14: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులోని ఎల్‌ఎన్‌ఎస్ క్రషర్ మిల్లులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్రషర్ మిల్లులో డ్రిల్లర్‌గా పనిచేసే మధ్యప్రదేశ్‌కు చెందిన విశ్రమ్‌కేవత్ (21), సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కడప జిల్లా వెంపల్లి మండలం, చింతలమడుగుపల్లి గ్రామానికి చెందిన ప్రతాప్ (26)లు గుట్ట పైభాగం నుంచి దొర్లుతూ కింద పడిపోవడం, వారి వెంట పెద్ద బండరాళ్లు పడటంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందారు. ఎల్‌ఎన్‌ఎస్ క్రషర్ మిల్లులో గుట్టలను ధ్వంసం చేసేందుకు బ్లాస్టింగ్ కోసం విశ్రమ్‌కేవత్ డ్రిల్లింగ్ చేస్తున్నాడు. ఎలాంటి భద్రతలు పాటించకుండా గుట్ట అంచుభాగంలో ఉంటూ డ్రిల్లింగ్ చేస్తుండటంతో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు.
అక్కడే ఉన్న సూపర్‌వైజర్ ప్రతాప్ అతన్ని రక్షించే ప్రయత్నంలో పడిపోయాడు. ఏసీపీ రామోజి రమేష్, ఆర్డీవో ఎస్.సూరజ్‌కుమార్, సీఐ వెంకటయ్యలు సంఘటన ప్రాంతానికి చేరుకోని పరిస్థితిని సమీక్షించారు. తోటి కార్మికుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాల ను పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.