క్రైమ్/లీగల్
అగ్రిగోల్డ్ కేసులో ఏలూరు జైలుకు సీతారామారావు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 25 May 2018
ఏలూరు: రాష్టవ్య్రాప్తంగా పెను సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితునిగా భావిస్తున్న అవ్వా సీతారామారావును సీఐడీ అధికారులు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని ఎస్సీ, ఎస్టీ సెల్ న్యాయమూర్తి కె సునీత ఎదుట హాజరపర్చారు. న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించడంతో ఏలూరులోని జిల్లా జైలుకు తరలించారు. రెండు రోజుల క్రితం సీతారామారావును ఢిల్లీలో సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు సోదరుడు అయిన సీతారామారావు ఈ కేసులో కీలక నిందితునిగా భావించిన సీఐడీ అధికారులు గత కొద్దినెలలుగా ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ఎట్టకేలకు అరెస్టు చేసిన సీతారామారావును కోర్టులో హాజరుపర్చారు.