క్రైమ్/లీగల్

చెరువులోకి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, మే 25: ఎడపల్లి మండలం అలీసాగర్ చెరువులో దూకి ఓ బీటెక్ విద్యార్థి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోల్‌హనుమాన్ ప్రాంతానికి చెందిన పీ.సౌమిత్(19) బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన సౌమిత్ అలీసాగర్‌కు చేరుకుని, చెరువులో దూకి నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సౌమిత్ మృతదేహాన్ని వెలికి తీయించారు. అయితే అతను ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలు ఇంకనూ వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.