క్రైమ్/లీగల్

నకిలీ దస్తావేజుల కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల, మే 26: విజయవాడ పెనమలూరుకు చెందిన కంచర్ల శ్రీనివాస్‌ను నకిలీ దస్తావేజులతో రిజిస్ట్రేషన్‌లు చేసి మోసగించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు విచారణ అధికారి, నూజివీడు డీఎస్‌పీ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితులైన మధిరకు చెందిన శీలం కోటిరెడ్డి, కొణిజర్లకు చెందిన కపిలవాయి కృష్ణవేణి, డాక్యుమెంట్ రైటర్ కల్లూరు ముత్యాల వెంకటరెడ్డిలను స్థానిక మార్కెట్ వద్ద శనివారం అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిని నందిగామ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ కేసులో నకిలీ లింక్ డాక్యుమెంట్ తయారు చేసిన మధిరకు చెందిన గద్దల ప్రసాద్, నకిలీ ఆధార్ కార్డులతో రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాల సమయంలో సాక్షులుగా సంతకాలు చేసిన మరి కొందరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.