క్రైమ్/లీగల్

కోడెల కోర్టుకు హాజరు కావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ (లీగల్), మే 28: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు 2014 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశానంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంఘటన తెలిసిందే. ఒక ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కడి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ మీడియా ముఖంగా బహిర్గతంగా వెల్లడించారు. కోడెల శివప్రసాద రావు ఎన్నికల ఖర్చుపై చేసిన వ్యాఖ్యల పట్ల కరీంనగర్‌కు చెందిన రాజకీయ నాయకుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కరీంనగర్ కోర్టులో తన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కరీంనగర్ స్పెషల్ మోబైల్ కోర్టు (పిసిఆర్) న్యాయమూర్తి ఎం.రాజు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు జూన్ 18న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.