క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు లెక్చరర్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: బస్సును లారీ ఢీ కొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైన కామర్స్ కాంట్రాక్టు లెక్చరర్ జి హరిప్రసాద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయిల ఆర్ధిక సాయాన్ని, ఇంటర్మీడియట్ బోర్డు మరో ఐదు లక్షల రూపాయిల పరిహారాన్ని ప్రకటించింది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్‌లో పాల్గొనేందుకు హుజూరాబాద్ నుండి కరీంనగర్‌కు బస్సులో ప్రయాణిస్తున్నపుడు ఆ బస్సును మరో లారీ ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్యకు పొరుగు సేవల ద్వారా ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటామని బోర్డుకార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్, ప్రైవేటు కళాశాల జూనియర్ లెక్చరర్‌లు కూడా గాయపడగా, వారిని కరీంనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో మెరుగైన చికిత్సకు చేర్చినట్టు చెప్పారు.