చిత్తూరు

‘ఆదర్శ పాఠశాల వద్ద బస్సులు ఆపాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లె, సెప్టెంబర్ 19: మండలంలోని కమ్మనపల్లి వద్ద గల ఆదర్శ పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ పాఠశాలలో ఇంటర్ విద్య వరకు అవకాశం ఉన్నది. మండలంలోని వివిధ గ్రామాల నుండి రోజు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు నిలుపక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటి చైర్మన్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.