చిత్తూరు

‘పార్టీలో ప్రథమ స్థానం కార్యకర్తలకే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకుప్పం, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీలో ప్రథమ స్థానం కార్యకర్తలకే అని మండలాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్ర్తిశక్తి భవనంలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు క్రీయాశీల సభ్యత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావాలన్నారు. సభ్యత్వ నమోదు కానివారు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేసి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండల ప్రథమ స్థానంలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని కోరారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నేతలు, ప్రజలు, అభిమానులు పార్టీలకు అతీతంగా పాల్గొనాలన్నారు. ఈకార్యక్రమంలో శ్రీనివాసులరెడ్డి, సీతాపతి, నారాయణాచారి, మనోహర్, అల్లిసీనా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.