చిత్తూరు

అక్టోబర్ 23న ఏడు కొండల పరుగుపందెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతిలో అక్టోబర్ 23న ఏడుకొండలు పరుగుపందెం (సెవన్‌హిల్స్ మారథాన్) రాత్రి సమయంలో నిర్వహించడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు మారధాన్ అధికారి సుశాంత్ సుబుధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారన్నారు. రాత్రి సమయంలోఈ పరుగుపందెం నిర్వహించడం ప్రపంచంలోనే ఇది రెండవదన్నారు. మొదటిది ఈ సంవత్సరం జూలై 2న సీ ఎం ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించామన్నారు. కాగా అక్టోబర్ లో నిర్వహించనున్న పరుగుపందెంలో 10కె, 5కె, 3కె నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు, యువత ఈ వెబ్‌సైట్ నందు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.7హిల్స్‌మారథాన్.కామ్ పేర్లు నమోదుచేసుకోవాలన్నారు.