చిత్తూరు

ఘనంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, మే 17: పట్టణంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణం జరిగింది. సాయంత్రం ధ్వజస్థంభానికి అర్చకులు అలంకారం చేసి పూజలు నిర్వహించారు. ఆ తరువాత గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈసందర్భంగా ఆలయంలోని వరదరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 20వ తేదీ హనుమంత వాహనం, 21న మోహినీ ఉత్సవం, గరుడసేవ, 22న కల్యాణోత్సవం, 24న పల్లకీ సేవ, 25న పార్వేటి ఉత్సవం, 26న ఏకాంత సేవ ఉత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయంలో చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. స్వామిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూలైన్లను నిర్మించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. సోమవారం సాయంత్రం అంకురారోపణ జరిగింది.