చిత్తూరు

టిటిడి ఇఓకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 17: ఇటీవల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన టిటిడి ఇ ఒ సాంబశివరావును టిటిడిలోని పలు విభాగాల అధికారులు దుశ్శాలువలు, పుష్ప గుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం టిటిడి సీనియర్ అధికారులతో ఇ ఒ సమీక్షా సమావేశం అనంతరం ఈ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఇ ఒ వారిని ఉద్దేసించి మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. ఈకార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, అదనపు ఎఫ్ ఏ అండ్ సి ఏ ఓ బాలాజీ పాల్గొన్నారు.