చిత్తూరు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూలై 19: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. విశేషమైన గురుపౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న సుపర్ణునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం.చిత్తరంజన్ గానం చేసిన అన్నమయ్య నామ సంకీర్తన వైభవం సిడిలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, బోర్డు సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.