చిత్తూరు

ఆటోను ఢీకొన్న కారు: ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 21: మండలంలో శ్రీ కాళహస్తి-రేణిగుంట జాతీయ రహదారిపై మల్లవరం వద్ద రోడ్డుపై ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఓ ప్రయాణీకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని మల్లవరం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శనివారం రాత్రి 10 గంటలకు రేణిగుంట నుంచి ఏర్పేడుకు వెళ్తున్న షేర్ ఆటోను శ్రీ కాళహస్తి వైపునుంచి తిరుపతికి వెళ్తున్న మారుతీ కారు ముందువెళ్తున్న లారీనీ ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఏర్పేడుకు చెందిన సామయ్య (65),కు తీవ్రగాయాలవ్వగా ఆటో డ్రైవర్ గురవయ్య స్వల్పగాయాలకు గురయ్యాడు. స్థానికులు 108లో గాయపడిన వారిని రుయాలో చికిత్సకు పంపించగా చికిత్స పొందుతూ సామయ్య ఆసుపత్రిలో మృతిచెందాడు. రేణిగుంట హెడ్ కానిస్టేబుల్ జిలానీ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.