ఆంధ్రప్రదేశ్‌

కళాతో దేవినేని నెహ్రూ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ గురువారం ఇక్కడ ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావును కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు పది నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది. టిడిపిలో చేరేందుకు నిర్ణయించుకున్నందునే నెహ్రూ కళాను కలిశారని సమాచారం. మంత్రి దేవినేని ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, గద్దె రామ్మోహన్ వంటి నాయకులు కూడా నెహ్రూను టిడిపిలో చేర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని పార్టీ అధిష్ఠానానికి చెప్పినట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో టిడిపి అధినేత చంద్రబాబును కలిశాక, కృష్ణా పుష్కరాల తర్వాత నెహ్రూ టిడిపిలో చేరతారని భోగట్టా. నెహ్రూతో పాటు ఆయన తనయుడు దేవినేని అవినాష్, ముఖ్య అనుచరులు కూడా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.