మెయన్ ఫీచర్

బ్రాహ్మణ సంక్షేమం.. ఈశ్వరుడికి సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ సంబంధ సేవలనే బ్రాహ్మణులు చేస్తున్నారని, అయినా ఆ కులస్థుల్లో కొం దరి పరిస్థితి దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బుల కోసం అర్చకులు ఎదురుచూసే దుర్భర పరిస్థితులను అధిగమించాలని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్ అన్న మాటలను విశే్లషించాల్సిన తరుణమిది. ప్ర భుత్వం, మేధావులు కలసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా కెసిఆర్ సూచించారు. ఇంతకూ బ్రాహ్మణులు చేస్తున్న సమాజ సేవ ఏమై వుంటుందని విశే్లషించి చూస్తే- అది వ్యక్తిగత, మతపరమైన, దోష నివారణ సంబంధమైన సేవలేనని, శుభాశుభ కార్యాలు అందులో భాగమేనని అర్థం చేసుకోవాలి. సామాజిక, సాంస్కృతిక ప్రవచనాలిస్తూ తద్వారా వాఙ్మయ విస్తరణ, ధర్మప్రబోధనకు బ్రాహ్మణులు అనాదిగా కృషి చేస్తున్నారు. ముక్తిప్రదాయినైన పరావిద్యను, జ్ఞాన సముపార్జనకు అవసరమైన అపరావిద్యను వ్యాప్తిచేసేందుకు సేవలందిస్తున్నారు. ఇదంతా స్వయంగా స్వాధ్యాయం చేస్తూ సమాజసేవకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు.
సృష్టి ఆది నుండీ బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతి ఎలా రూపాంతరం చెందిందనే విషయంలో కొందరు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలు ఆలోచింపదగ్గవే. సృష్టికీ, బ్రాహ్మణులకూ అనిర్వచనీయమైన అనుబంధం వుంది. ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీలేదు. పంచభూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!’ అనేది ఋగ్వేదంలోని సంస్కృత శ్లోక సారాంశం. ‘అయోధ్య’ తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ అగర్వాల్ చెప్పినట్లు- ‘సృష్టికి పూర్వం అంతా శూన్యం, చీకటిమయం, జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు- ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారణమైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా లేక మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. ‘సుందరకాండ’లోనూ ఈ ప్రస్తావన వుంది. సృష్టించేవాడు బ్రహ్మ అని, సంస్కరించేవాడు రుద్రుడు అనీ అంతా అనుకుంటారు. అనంతకోటి బ్రహ్మాండానికి ‘పరబ్రహ్మం’ ఒక్కరే! అతడికి లేదా ఆమెకు సమానులైనవారు, అధికులైనవారు ఎవరూ లేరు. ఆ పరబ్రహ్మమే సృష్టికొక అధికారినీ, సంహారానికి మరొకరినీ నియమించారు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులు. భగవంతుడైన విష్ణుమూర్తి- రజోగుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టికార్యాన్ని, తమోగుణం వున్నవారిలో ప్రవేశించి సంహారకార్యాన్ని, సత్వగుణం వున్న వారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేయిస్తాడు. అందుకే సమస్త ప్రయోజనకర్త ఆ భగవంతుడే. హైదరాబాద్‌లో బ్రాహ్మణ సంక్షేమ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్ మాటల్లోని సారాంశంతో- పైన పేర్కొన్న అంశాలను అన్వయించి విశే్లషిస్తే బ్రాహ్మణుల ఆవిర్భావం, అవసరం, రూపాంతరం, తదనంతర స్థితిగతులు కొంతవరకు అర్థం చేసుకోవచ్చునేమో.
ప్రపంచవ్యాప్తంగా వందల వేల సంవత్సరాల చరిత్ర, ఒక దేశంపై మరొక దేశం దాడులు, దాడి తరువాత ఆక్రమణలు, అంతకు పూర్వం నెలకొన్న నాగరికత, సంస్కృతి, సంప్రదాయాల విధ్వంసం లాంటి విషయాలను విశే్లషించి చూస్తే కొన్ని విషయాలు అవగతవౌతాయి. ఒకప్పుడు ముస్లిమేతర దేశాలైన ఇరాన్- పర్షియా, టర్కీ, ఈజిప్ట్‌లను ఆక్రమించుకు న్న ఇస్లాం దేశాలు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మానికి విరుద్ధంగా వాటిని మార్చడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఉదాహరణకు అగ్నిహోత్రం చేసుకుని బతికే భారతీయులున్న ఇరాన్‌ను మార్చేశారు. ఐదారు వేల ఏళ్ల చరిత్ర వున్న పర్షియాను, టర్కీని, ఈజిప్ట్‌ను మార్చడానికి కేవలం రెండు దశాబ్దాల కాలం సరిపోయింది. 800 ఏళ్ల ముస్లిం రాజుల పాలనలో కాని, 200 ఏళ్ల ఆంగ్లేయుల క్రైస్తవ పాలనలో కాని భారతదేశాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని లొంగదీయడం వారికి చేతకాలేదు. దీనికి కారణం మనల్ని పాలించిన ఆ పరాయి వారి సంస్కృతి పరిమితమైన ‘ఎక్స్క్లూజివ్ సంస్కృతి’. కొందరికే నిలయమైందది. మనదేమో ఇన్‌క్లూజివ్- సంఘటిత సంస్కృతి. అనేక ఏళ్లనాటి ఆర్య సంస్కృతి.. ఇందులో అందరికీ స్థానం వుంది.
ఆర్య సంస్కృతి పరాయి దాష్టీకాన్ని తట్టుకుని నిలదొక్కుకుంది. అలా తట్టుకోవడంలో బ్రాహ్మణుల పాత్ర కీలకం. అనాదిగా ఆ సంస్కృతికి సంరక్షకులు బ్రాహ్మణులు కావడమే దీనికి కారణం. ఇండిక్ నాగరికతను పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ తరతరాలకు అందించిన ఘనత కూడా బ్రాహ్మణులదే. మన నాగరికత, దానిలోని విలువలు, అందులోని సద్గుణాలు, సత్ప్రవర్తన, నీతి, ధర్మాలు.. ఇవన్నీ వ్యక్తికీ, వ్యక్తితోపాటు సమిష్టికీ స్థానమిచ్చింది. మరోవైపు ఇస్లాం, క్రిస్టియానిటీ, తదనంతరం రూపుదిద్దుకున్న కమ్యూనిజం లాంటి ఇజాలు, సమిష్టికో లేదా వ్యక్తికో స్థానమిచ్చాయి కాని రెండింటికీ కలిపి ఇవ్వలేదు. మన సాంప్రదాయాలు, నాగరికత, ఆర్య సంస్కృతి, లోక కళ్యాణకారిగా విలసిల్లుతూ వస్తున్నది అనాదిగా. ఇటువంటి ఉత్కృష్టమైన నాగరికత బ్రాహ్మణుల సంరక్షణలోకి రావడానికి కారణం ఋషులు. వీరే ‘కార్యబ్రహ్మలు’ అని కూడా పిలువబడ్డారు. మనందరం సృష్టి మూలం అనుకుంటున్న చతుర్ముఖ బ్రహ్మను ‘కారణ బ్రహ్మ’అని కూడా అంటారు. ఆయనే తొలుత ఋషులను సృష్టించి వారిని ‘కార్యబ్రహ్మలు’గా నియోగించాడు. దేవతల కంటే పూర్వమే ఋషులను సృష్టించాడు చతుర్ముఖ కారణ బ్రహ్మ. ఆ తరువాతనే మిగిలినవారందరూ వచ్చారు.
నాగరిక జీవనానికి ముందు ఆదిమానవులుండేవారు. అప్పుడు ఈశ్వరుడి ఆజ్ఞానుసారం తపోలోకంలో నివసిస్తున్న ఋషులు భూలోకంలో జన్మించారు. తోటి మానవులకు జీవాత్మ, పరమాత్మ, మానవ జన్మ శ్రేష్టత, సృష్టి, నిర్మాణం, మానవుల స్థానం లాంటి వాటిని గురించి తెలియచేయమని వారిని ఈశ్వరుడు కోరాడు. ఆ విధంగానే మానవులకు గమ్యం, గమనం, ధర్మాధర్మాలు చెప్పి వారిని సంస్కరించి, మార్గదర్శకత్వం ఇచ్చి తపోలోకానికి మరలిపోయారు. ఆ విధంగా ఋషులు భూలోకంలో జన్మించి, తపస్సుచేసి, సంస్కృతిని నెలకొల్పారు. అందుకే ఆర్య సంస్కృతిని ‘ఋషి ప్రోక్తమ్’అంటాం. శాస్త్రాలతో సహా అత్యంత విలువైన వాఙ్మయ సంపద మనకిచ్చారు. సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సంస్కృతిని మనకు ధారాదత్తం చేశారు. మానవుల సంతానాన్ని వివాహం చేసుకున్నారు. పిల్లలను కన్నారు. అలా కలిగిన వారి సంతానాన్ని, వారు మనకందించిన జ్ఞానం, వాఙ్మయ సంపద పరిరక్షిస్తూ సమాజానికి ఉపయోగపడమని, దానే్న తరతరాలకు అందించమని, సమాజానికి సేవచేయమని చెప్పి, అప్పుడు తపోలోకానికి మరలిపోయారు. ఆ ఋషులు తమ తపోధనాన్ని ధారపోసి అధ్యయనం చేసిన వేదవేదాంగాలను బ్రాహ్మణులకు అప్పచెప్పారు. జీవన విధానం, ఆర్య సంస్కృతి నేర్పారు. అలా ఋషులనుంచి అందిపుచ్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నవారి వంశస్తులే ‘బ్రాహ్మణులు’. పరాయి పాలనలో అవి దెబ్బతినకుండా సంరక్షించుకుంటూ వస్తున్నారీ బ్రాహ్మణులు. ‘పురోహితులు’గా సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ వస్తున్నారు.
బ్రాహ్మణుడి జీవితం త్యాగంతో కూడుకున్న యజ్ఞం అని అనాలి. దీనికి ఉదాహరణగా అగస్త్యమహర్షి వృత్తాంతం చెప్పుకోవచ్చు. ఎ ప్పుడూ తపోనిష్టలో వుండే ఆ మహర్షి- ఓ రాజ్యంలో క్షామం తాండవిస్తోందని తెలిసి, అక్కడికి పోయి, తన కమండలంలోని నీళ్లు చేతుల్లోకి తీసుకుని, రాజ్యం సుభిక్షం చేయడానికి తన యావత్ తపోశక్తిని ధారబోశాడు. ఫలితంగా రాజ్యం సుభిక్షమైంది.. ఆయన తపోనిష్టలోకి పోయాడు. అదే మహర్షి తన సొంత కూతురి వివాహం విషయం వచ్చేసరికి, అది తన స్వవిషయం కాబట్టి, తపస్సు ఉపయోగించలేదు. భిక్షాటనకు బయలుదేరాడు. దీనే్న ‘స్వచ్ఛంద బీదరికం’ అంటారు. ఇది బ్రాహ్మణులే చేయగలరు- చేశారు- చేస్తున్నారు కూడా. తపస్సు అంటే వారికి జ్ఞాన సముపార్జన లాంటిది. వారలానే జీవించారు. విలువలను పాంచారు. అలానే జీవించమని తోటి బ్రాహ్మణులకు కూడా ఉద్భోదించారు. అందుకే బ్రాహ్మణుడు విద్యను అభ్యసించేవాడు. యోగ్యుడైన వాడికి తన విద్యను దానం చేసేవాడు. ఇంతచేసి గురుదక్షిణగా కేవలం ‘్ధర్బపుల్ల’నే తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. వారి జీవన భృతి గురుదక్షిణ కాని లేదా భిక్షాటన కాని మాత్రమే. వేరే మార్గంలో పోలేదెప్పుడూ. ఈ క్రమంలోనే నిత్యాగ్నిహోత్రం చేస్తాడు. అందులో ‘లోక కళ్యాణం’ అనే సంకల్పం తప్ప మరేదీ వుండదు.
స్వచ్ఛంద బీదరికంలో వుంటూనే బ్రాహ్మణుడు స్వాధ్యాయం, జ్ఞాన సముపార్జన తప్ప మరేదీ ఆలోచించడు. విద్యను అమ్ముకోడు. జీవించడానికి భిక్షాటన చేస్తాడు. అలా బ్రాహ్మణుడి జీవితమంతా త్యాగమే.. త్యాగంతో కూడుకున్న యజ్ఞమే! అసలు యజ్ఞం అంటేనే త్యాగం. యజ్ఞానికి త్యాగమే మూలం. బ్రాహ్మణుడి జీవన విధానమే త్యాగంతో కూడుకున్న మహాయజ్ఞం. అగస్త్యుడి లాంటి మహర్షులు తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణులను- ‘్ధర్మంగా జీవించండి, సమాజానికి సేవ చేయండి, సమాజం కోసం బతకండి’ అని ఆదేశించారు. తమ గురించి ఏమీ ఆలోచించని, కోరని బ్రాహ్మణులను ‘్భసురులు’ అని అంటారు.
ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన బ్రాహ్మణుల సమావేశం భవిష్యత్‌లో వారి సంక్షేమం కోసం ఒక బహుముఖ వ్యూహం రూపొందించుకునేందుకు దోహదపడుతుంది. వైదిక వి ద్యకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే వారికి చేయూత, సంప్రదాయాలు కాపాడే వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారికి ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణుల విద్య, వైద్య, వివాహాది అంశాలకు ప్రాధాన్యత, ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు తగు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటుకు దారితీస్తుంది. హైదరాబాద్‌లో నిర్మించే బ్రా హ్మణ సదనం బ్రాహ్మణ సమాజోద్ధరణ వేదికగా ఉపయోగపడుతుంది. ఆచార, సంప్రదాయాల పరిరక్షణకు వీలుకలుగుతుంది. ధర్మ సంరక్షణకు,బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ధర్మాన్ని, ఆర్య సంస్కృతిని, నాగరికతను, సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణులకు- వాటిని భవిష్యత్‌లో కూడా వారు కొనసాగించడానికి భరోసా ఇపుడు కలుగుతోంది. ఇలాంటివి కా ర్యరూపం దాల్చినపుడు- ‘బ్రాహ్మణుల సంక్షేమంతో ఈశ్వరుడికి సైతం సంతోషం కలుగుతుందనడం’లో అతిశయోక్తి లేదేమో!

-వనం జ్వాలా నరసింహారావు