రాష్ట్రీయం

రాష్టప్రతికి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీకి బయలుదేరిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, గవర్నర్ నరసింహన్ గురువారం ఉదయం హకీంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఉదయం 11.30గంటలకు రాష్టప్రతి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. శీతాకాల విడిది సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్టప్రతి పాల్గొన్న వివిధ కార్యక్రమాల ఫొటో ఆల్బమ్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్టప్రతికి అందజేశారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ సివి ఆనంద్, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్, ఐఅండ్‌పిఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్ రాష్టప్రతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
నేడు ప్రభుత్వ సెలవు
నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
(చిత్రం)గురువారం ఢిల్లీ బయలుదేరిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకీ వీడ్కోలు చెబుతున్న
గవర్నర్ నరసింహన్, సిఎం కెసిఆర్