ఆంధ్రప్రదేశ్
ముద్రగడ కీలుబొమ్మ: మంత్రి గంటా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 May 2016
విజయవాడ: కొంతమంది ఆడిస్తున్న నాటకంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలుబొమ్మలా మారారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో కాపులకు రిజర్వేషన్ల గురించి ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపుగర్జన సందర్భంగా తునిలో విధ్వంసకాండకు వైకాపా ప్రోత్సాహం ఉందన్నారు. ఉద్యమాల పేరిట కాపులకు ముద్రగడ అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకోవాలన్న తపన సిఎం చంద్రబాబుకు లేదని గంటా అన్నారు. కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత తమ నాయకుడికే దక్కిందన్నారు.