రాష్ట్రీయం

జీహెచ్ఎంసీలో భారీగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం జోరందుకుంది. రెండు రోజుల మాత్రమే మిగిలి ఉండటంతో శనివారం భారీగా నామినేషన్ల దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. - బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె విజయలక్ష్మీ నామినేషన్ వేశారు. జాంబాజ్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదే డివిజన్ లో ఎంఐఎం అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ నేత డి.మోహన్ నామినేషన్ వేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి ఆల్వాల్‌లో టీఆర్‌ఎస్ తరపున నామినేషన్ వేశారు.