రాష్ట్రీయం

ఇద్దరు బాలికల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతిచెందారు. ఈ మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎల్బీనగరలోని టిఎన్‌ఆర్ వైష్ణవి శిఖర అపార్ట్‌మెంట్‌లో నివశించే కాంతిపటేల్ వ్యాపారి చిన్న కుమార్తె భార్గవి(15), సహ విద్యార్థిని శ్రావణి ఈ ఘటనలో చనిపోయారు. ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు. మొదటి పరీక్ష రాశారు. ఇద్దరు కలిసి చదువుకునేందుకు సిద్ధమయ్యరు. గురువారం 6.30 గంటల సమయంలో ఇరువురు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లారు. తరువాత కిందపడి చనిపోయారు. పోలీసులు పరిశీలించగా శావ్రణి ఇంటిలోని చెత్తబుట్టలో ఆ బాలిక రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. తల్లిదండ్రులను, సోదరుడ్ని మిస్ అవుతున్నట్లు, క్షమించమన్నట్లు రాసి ఉంది. పోలీసులు ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించగా.. భార్గవి రక్షించటానికి ప్రయత్నించి ఇద్దరు కిందపడి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.