క్రైమ్/లీగల్

మైనర్‌పై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), ఆగస్టు 23: మైనర్ అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు ఒకటవ అదనపు జిల్లా న్యాయమూర్తి నందికొండ నర్సింగరావు గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... స్థానిక పొన్నూరు రోడ్డు సాయిబాబా కాలనీకి చెందిన షేక్ ఖాజావలి, అదే ప్రాంతానికి చెందిన మైనర్‌పై సంఘటనకు మూడు నెలల క్రితం నుండి లైంగికదాడి చేసేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బంధువులు ఇతనితో పాటు సహకరించిన మేకల బాబు అనే 16 ఏళ్ల బాలుడిపై కూడా ఫిర్యాదు రావడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. బాబుని జువైనల్ కోర్టులో హాజరుపర్చగా, ఖాజావలిపై కేసు దర్యాప్తుచేశారు. ఖాజావలిపై నేరం రుజువుకావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నర్సింగరావు తీర్పుచెప్పారు. మైనర్ బాలికకు లక్షా 50 వేల రూపాయల పరిహారం అందించాలని న్యాయమూర్తి నర్సింగరావు జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫారసు చేశారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కట్టా వెంకట వరలక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.