రాష్ట్రీయం

హింస కోరుకుంటున్న విపక్షం: సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: విపక్షంలో ఉన్న వైకాపా హింసను కోరుకుంటోందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడారు. జగన్ అభివృద్ధి నిరోధకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో ఇన్నర్ రోడ్డు విషయంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, వైకాపా ఎమ్మెల్యేలతో నిరాహారదీక్షకు జగన్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికీ జగన్ అడ్డుతగులుతున్నారని అన్నారు. కాగా వైకాపా ఎమ్మెల్యే రోజా తన భాషను అదుపులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. జగన్ ఆపిల్ ఫోన్ అని రోజా అంటున్నారని, చంద్రబాబు పాత మిషన్ అంటున్నారని, అయితే ఆపిల్‌ఫోన్ చార్జింగ్ 4 గంటలే ఉంటుందని, చంద్రబాబు రోజుకు 18 గంటలు చార్జింగ్‌లో ఉంటారని అన్నారు.