రాష్ట్రీయం

2న విజయవాడలో కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా ఒక్క కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని, కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధించడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యదర్శి తులసిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్లో పీసీసీ కార్యదర్శి గౌతమ్‌తో కలిసి తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏప్రిల్ 2న విజయవాడలో కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష చేయనుందని పీసీసీ కార్యదర్శి గౌతం తెలిపారు. వచ్చే నెల 3 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.