ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో జగన్ పర్యటన వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: వైకాపా అధినేత జగన్ ఈనెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో జరుపతలపెట్టిన పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వైకాపా జిల్లా నేతలకు సమాచారం అందింది. కాపుఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం రాజమండ్రి ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నందున శాంతి భద్రతల పరిస్థితిపై పోలీసులు నిఘా పెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేస్తుండగా తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి ఆస్పత్రిలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నందున కాపు ఉద్యమకారులు భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో గోదావరి జిల్లాల్లో పర్యటించక పోవడం మేలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.